
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ సమయంలో కామెంటేటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్ల మధ్య ఆన్-ఎయిర్లో వివాదం చోటుచేసుకుంది.
మంజ్రేకర్ ముఖ కవళికలను ఉద్దేశించి కార్తీక్ చేసిన వ్యాఖ్యలకు, మంజ్రేకర్ కౌంటర్ ఇవ్వడంతో పరిస్థితి వేడెక్కింది.
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇద్దరూ సంయమనం పాటించి వివాదానికి తెరదించారు.