
2016 సెప్టెంబర్ 5న వాణిజ్య సేవలు ప్రారంభించిన రిలయన్స్ జియో, గత పదేళ్లలో 1 జీబీ డేటా ధరను రూ. 228 నుంచి రూ. 7.9కి తగ్గించి 97 శాతం ధర తగ్గింపును సాధించింది.
జూన్ 2026 నాటికి తెలుగు రాష్ట్రాల్లో జియో చందాదారుల సంఖ్య 3.25 కోట్లకు చేరుకోగా, మొత్తం వైర్లెస్ కనెక్షన్లలో 36.9% వాటాతో రెండో అతిపెద్ద టెలికాం వ్యవస్థగా అవతరించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4జీ, 5జీ వినియోగదారుల సంఖ్య 93.8 కోట్లకు పెరగగా, ఒక జియో వినియోగదారు సగటున నెలకు 42.3 జీబీ డేటాను వినియోగిస్తున్నారు.