
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి, రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు.
తెలంగాణలోని మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.