
గినియా రాజధాని కొనక్రిలోని దార్ ఎస్ సలామ్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా చెత్త డంపింగ్ యార్డ్ కొండలా విరిగిపడటంతో 30 మంది మరణించారు.
ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.