
రాబోయే పదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మనుషుల కంటే ఎంతో తెలివిగా మారే అవకాశం ఉందని, 2036 నాటికి బాట్లు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయని ఎలాన్ మస్క్ అన్నారు.
AI మానవాళిని పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం 10 నుంచి 20 శాతం ఉందని, AI వల్ల ఉత్పత్తి పెరుగుతుందని, పనులు వేగంగా పూర్తవుతాయని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రపంచం సింగ్యులారిటీ అనే కొత్త దశలోకి అడుగుపెడుతోందని, AI వ్యవస్థలు మానవ మేధస్సును అధిగమించే స్థితికి చేరుకుంటున్నాయని ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ కూడా అభిప్రాయపడ్డారు.