
అక్టోబర్లో కోల్కతాలో జరగనున్న భారత్-బ్రెజిల్ స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ను బహిష్కరించాలని మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా అభిమానులను కోరారు.
ఈ మ్యాచ్ నిర్వహణకు రూ. 60 నుంచి 70 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని, ఆ నిధులను క్రీడల అభివృద్ధికి వాడాలని ఆయన సూచించారు.
1995 నుంచి 2011 వరకు 83 మ్యాచ్లాడి 27 గోల్స్ చేసిన భూటియా, ఆ డబ్బును 2030 కామన్వెల్త్ గేమ్స్ సన్నాహాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.