
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం 7 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.