
రోహిత్ శర్మ 2027 ప్రపంచకప్ ఆడబోతున్నాడని బీసీసీఐ మరియు టీమ్ మేనేజ్మెంట్ స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ కెప్టెన్ అజింక్య రహానే కోరారు.
రోహిత్ శర్మ అనుభవం జట్టుకు ఎంతో అవసరమని, ప్రతి సిరీస్కు ముందు అతని భవిష్యత్తుపై చర్చ జరగడం సరికాదని రహానే అభిప్రాయపడ్డారు.
ఆటగాడికి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే స్వేచ్ఛగా ఆడగలడని, రోహిత్ స్థాయి ఆటగాడి నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని ఆయన మద్దతు తెలిపారు.