
ఈక్విరస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, ఆగస్టులో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 16 శాతం పెరిగి 4.01 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాలు వార్షికంగా 52 శాతం వృద్ధి చెంది 30,700 యూనిట్లకు చేరగా, మొత్తం రిటైల్ అమ్మకాల్లో క్లీన్ ఎనర్జీ వాహనాల వాటా 42 శాతానికి పెరిగింది.
సీఎన్జీ కార్ల విభాగంలో మారుతి సుజుకి 71 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోగా, ఈవీ మార్కెట్లో టాటా సంస్థ 43 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది.