
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
రాజకీయ వ్యవస్థ నేతాజీ కలలు కన్న బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు సీఎం మమతా బెనర్జీకి లేఖ పంపారు.
2016లో బీజేపీలో చేరిన ఆయన, ఆ తర్వాత 2023లో ఆ పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు, కానీ నాలుగు నెలలకే ఆ పార్టీకి కూడా స్వస్తి పలికారు.