
భారత్ మరియు పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్లను కేవలం క్రీడగా మాత్రమే చూడాలని మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ సూచించారు.
చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరును అభిమానులు క్రికెట్కు అతీతంగా చూడటంపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇరు దేశాల మధ్య మ్యాచ్లను చూసే దృక్పథం ఇకనైనా మారాలని వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.