
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ రెండు ఇన్నింగ్స్లలో కలిపి మొత్తం 350 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
గత 39 ఏళ్లుగా రమణ్ లంబా పేరిట ఉన్న 320 పరుగుల రికార్డును అధిగమించి, ఈ ట్రోఫీ చరిత్రలో ఒకే మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఇషాన్ నిలిచాడు.
చెపాక్ స్టేడియంలో సౌత్ జోన్తో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్లో ఇషాన్ తొలి ఇన్నింగ్స్లో 270, రెండో ఇన్నింగ్స్లో 80 పరుగులు సాధించాడు.