
తెలుగులో 'సై' వంటి పలు చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూశారు.
రెండు నెలల క్రితం వరకు ఆరోగ్యంగా ఉన్న ఆయనకు, ఇటీవల అనారోగ్యం క్షీణించడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్పించగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
చికిత్స పొందుతూ నెలన్నర వ్యవధిలోనే ఆయన మరణించారని, వైద్యులు సీపీఆర్ చేస్తున్న ఆఖరి క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆయన కుమారుడు విక్రమాదిత్య ఎమోషనల్ అయ్యారు.