
కోరుట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు భారీ ధర్నా చేపట్టారు.
జిల్లా అధ్యక్షుడు కల్వకుంట విద్యాసాగరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
ఎమ్మెల్యేలు హామీల గురించి నిలదీస్తే పోలీసులతో దాడులు చేయించడం సరికాదని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.