
స్థూలకాయం కేవలం బరువు పెరగడం మాత్రమే కాదని, శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యాధి అని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు హెచ్చరించారు.
భారతీయుల్లో సన్నగా ఉన్నప్పటికీ పొత్తికడుపు చుట్టూ పేరుకుపోయే విసెరల్ ఫ్యాట్ వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు.
మన దేశంలో పిల్లల్లో స్థూలకాయం రేటు 15% నుంచి 18% వరకు ఉండటం ఆందోళనకరమని, జీవనశైలి మార్పులు, పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు.