
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అభిజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఈ మేళాలో 30కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు.
అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పి.వి. పవన్ కుమార్ రెడ్డి కోరారు.