కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక మహిళ తన ఆరేళ్ల కుమార్తెను నడుముకు కట్టుకుని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషాద ఘటనలో తల్లి, కుమార్తె ఇద్దరూ మృతి చెందగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.