
భారత్, జపాన్ దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా సెప్టెంబర్ 22న 'సుజుకి కప్' పేరుతో టీ20 మ్యాచ్ నిర్వహించనున్నారు.
జపాన్లోని టోచిగిలో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనున్నట్లు బీసీసీఐ ధ్రువీకరించింది.
ఈ కార్యక్రమం ద్వారా ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలను, ప్రజల పరస్పర సంబంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.