అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 450 బిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 42 లక్షల కోట్లు పెరిగింది.
బుధవారం వెల్లడించిన త్రైమాసిక ఫలితాల్లో అజ్యూర్ క్లౌడ్ ఆదాయం 43 శాతం వృద్ధి నమోదు చేయడంతో, గురువారం కంపెనీ షేర్లు 16 శాతం లాభపడి 3.35 ట్రిలియన్ డాలర్లకు చేరాయి.
మైక్రోసాఫ్ట్ 365 కో పైలట్ ఏఐ అసిస్టెంట్ వినియోగదారుల సంఖ్య 3 కోట్లు దాటగా, 2008 తర్వాత షేరు విలువలో ఇంతటి భారీ వృద్ధి నమోదు కావడం ఇదే మొదటిసారి.