
బెంగళూరులో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈస్ట్ జోన్ ఫైనల్లోకి ప్రవేశించింది.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్, కెప్టెన్ ఇషాన్ కిషన్ (39 నాటౌట్), మహ్మద్ షమీ (8 నాటౌట్) రాణించడంతో విజయం అందుకుంది.
మరో సెమీఫైనల్లో నార్త్ జోన్, సౌత్ జోన్పై 139 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 256/7 స్కోరుతో నిలిచింది.