
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అర్హత లేకున్నా క్లినిక్లు నిర్వహిస్తూ ప్రజలకు ఇంజక్షన్లు, సెలైన్లు ఇస్తున్న వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున వైద్య పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పారామెడికల్ కోర్సు చేసిన ఒక మహిళ నాలుగేళ్లుగా అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతున్నట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.