
చట్టబద్ధత లేని పథకాలకు ప్రజాధనాన్ని వృథా చేయడంపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు సంధించింది.
ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తెచ్చి ఆ నిధులను సంక్షేమ పథకాలకు ఖర్చు చేయవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.
భూసేకరణ బాధితుల సమస్యలపై గురువారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కోర్టు, పథకాలపై స్టే ఎత్తివేతపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.