సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2018-19 సిరీస్ VIలో పెట్టుబడి పెట్టిన వారికి ఐదేళ్ల తర్వాత భారీ లాభాలు చేకూరాయని ఆర్బీఐ వెల్లడించింది.
గ్రాముకు రూ.3,276 చొప్పున కొనుగోలు చేసిన బాండ్ల ముందస్తు విమోచన ధరను గ్రాముకు రూ.15,102గా ఆర్బీఐ ఆగస్టు 12న ప్రకటించింది.
వార్షిక 2.5 శాతం వడ్డీతో కలిపి, రూ. లక్ష పెట్టుబడిపై మొత్తం రూ. 4,78,500 రాబడి లభించిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.