
తమిళనాడు ప్రీమియర్ లీగ్ క్వాలిఫయర్-2 మ్యాచ్లో కోవై కింగ్స్ బౌలర్ దీబన్ లింగేష్ తొలి మూడు బంతుల్లోనే మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు.
ఈ మ్యాచ్లో తిరుచ్చి గ్రాండ్ చోళాస్ జట్టు 99 పరుగులకే ఆలౌట్ కాగా, ఐదుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే వెనుదిరిగారు.
ఈ విజయంతో ఫైనల్కు చేరిన కోవై కింగ్స్, ఆగస్టు 28న చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో మదురై పాంథర్స్తో టైటిల్ కోసం తలపడనుంది.