
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చే వారం రూపీ బాండ్ల జారీ ద్వారా రూ. 12,500 కోట్ల వరకు నిధులు సమీకరించాలని యోచిస్తోంది.
ఐదేళ్ల కాలపరిమితి గల ఈ బాండ్లపై 7.47 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేయనుండగా, ఈ నెల 18న ఇష్యూ ప్రారంభం కానుంది.
2023 నవంబరులో రూ. 20,000 కోట్లు సమీకరించిన తర్వాత, దాదాపు మూడేళ్ల విరామం అనంతరం రిలయన్స్ దేశీయ మార్కెట్లో ఈ భారీ బాండ్ల జారీని చేపడుతోంది.