
ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఉరుములు, పిడుగులు మరియు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ మరియు వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి.
భారీ వర్ష సూచన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈ సాయంత్రం నాటికి హైదరాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాలలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.