
రష్యా రాజధాని మాస్కోలోని కుద్రిన్స్కయా స్క్వేర్ ప్రాంతంలో శనివారం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మృతి చెందారు.
ఈ ఘటనలో మరో 21 మంది గాయపడగా, బాంబును రెస్టారెంట్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన మహిళ కూడా మృతుల్లో ఉంది.
దీనిని ఉగ్రదాడిగా మాస్కో మేయర్ సెర్గీ సోబ్యనిన్ ధృవీకరించారు.