
హూలీహాన్ లోకీ నివేదిక ప్రకారం, ఐపీఎల్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ విలువ 11.4 శాతం పెరిగి 20.6 బిలియన్ డాలర్లకు (రూ. 1,97,024.68 కోట్లు) చేరుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 312 మిలియన్ డాలర్ల విలువతో అగ్రస్థానంలో ఉండగా, 300 మిలియన్ డాలర్ల మార్కును దాటిన మొదటి క్రికెట్ టీమ్గా రికార్డు సృష్టించింది.
ముంబై ఇండియన్స్ 264 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, కోల్కతా నైట్ రైడర్స్ 245 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచాయి.