
భారత క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీసీసీఐలో కీలక మార్పులు రావాలని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లే వంటి ప్రముఖ మాజీ క్రికెటర్లతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ వ్యవహరించిన తీరుపై అసంతప్తి వ్యక్తం చేస్తూ దేశవాళీ క్రికెట్ వ్యవస్థలోనూ సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు.