
నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించి కాంగ్రెస్పై పట్టు నిలుపుకుంటే ప్రతి వయోజన పౌరుడికీ 5 వేల డాలర్లు అందజేస్తామని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.
డల్లాస్లో జరిగిన రిపబ్లికన్ల సదస్సులో మాట్లాడిన ఆయన, ఈ పథకానికి ‘ట్రంప్ డివిడెండ్’ అని పేరు పెడతామని ప్రకటించారు.
ఈ హామీ అమలుకు దాదాపు 1 ట్రిలియన్ డాలర్లకు పైగా ప్రజాధనం వెచ్చించాల్సి ఉంటుందని, అయితే నిధుల సమీకరణపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.