ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా, మలద్వారంలో దాచి తరలిస్తున్న భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.65.69 లక్షలుగా అధికారులు అంచనా వేశారు.
నిందితుడు బంగారాన్ని ముద్దగా మార్చి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించగా, అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.