
చైనా మాస్టర్స్ పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో భారత షట్లర్ లక్ష్యసేన్ 14-21, 7-21 తేడాతో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
మరోవైపు కిదాంబి శ్రీకాంత్ 21-16, 21-15తో చి యు-జెన్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించాడు.
మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ 21-8, 21-9తో థాయ్లాండ్ జంటను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్కు చేరుకుంది.