
అమెరికాలోని దక్షిణ ఇడాహోలో ఉన్న ఒక రెస్టారెంట్లో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు పౌరులు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
కాల్పులకు పాల్పడిన అనుమానిత వ్యక్తి మృతదేహాన్ని రెస్టారెంట్ సమీపంలో పోలీసులు గుర్తించారు.
గాయపడిన ఏడుగురిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ట్విన్ ఫాల్స్ నగర అధికార ప్రతినిధి వెల్లడించారు.