
కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో భారీగా అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వెల్లడించారు.
ప్రస్తుతం టెక్ కంపెనీలలో వరుస లేఆఫ్లు ఉద్యోగులను కలవరపెడుతున్న తరుణంలో, ఏఐ సాంకేతికత కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సాంకేతిక రంగ పరిధిని దాటి ఇతర రంగాలలో కూడా ఈ ఏఐ డేటా సెంటర్ల వల్ల సరికొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని జెన్సన్ హువాంగ్ స్పష్టం చేశారు.