
భారత్ మరియు బ్రెజిల్ జట్ల మధ్య జరగనున్న స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ను బహిష్కరించాలని మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా అభిమానులకు పిలుపునిచ్చారు.
ఈ మ్యాచ్ నిర్వహణకు అవుతున్న భారీ ఖర్చును భూటియా తప్పుబట్టారు.
భారత ఫుట్బాల్ అభివృద్ధికి ఈ ఖర్చును ఇతర మార్గాల్లో ఉపయోగించాలని ఆయన సూచించారు.