అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అడవుల్లో వన్యప్రాణులను వేటాడుతున్న 17 మందిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
వేటగాళ్లు జింకలు, సాంబార్లను వేటాడి మాంసాన్ని హైదరాబాద్లోని అత్తాపూర్ వంటి ప్రాంతాలకు తరలించి కిలో రూ.800 నుంచి రూ.1,500 వరకు విక్రయిస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్చంద్ర తెలిపిన వివరాల ప్రకారం, అడవుల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ టీమ్లను ఏర్పాటు చేసి నిఘాను పెంచారు.