
చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న 2.7 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి బోనీ కపూర్ కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణ వరకు వివాదాస్పద ఆస్తి విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని ధర్మాసనం ఆదేశించింది.
ఈ కేసు మధ్యవర్తిత్వ పరిష్కారం కోసం డిసెంబర్ 18కి వాయిదా పడింది.