
ఐరోపా ఖండంలోని ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల సరిహద్దుల్లో అడవులు తగలబడుతూ భారీ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది.
ఈ అగ్నికీలలు ప్రపంచ వైన్ రాజధానిగా పేరొందిన ఫ్రాన్స్లోని బోర్డియక్స్ (Bordeaux) నగరం వైపు దూసుకువస్తున్నాయి.
కార్చిచ్చు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 2,20,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.