
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో రాజధాని కిన్షాషాలోని లింగ్వాలాలో శుక్రవారం రాత్రి జరిగిన పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం సంభవించి 22 మంది సజీవదహనమయ్యారు.
లింగ్వాలా మేయర్ నార్బర్ట్ ముషింగ తెలిపిన వివరాల ప్రకారం, అర్ధరాత్రి సమయంలో బిల్డింగ్లో చెలరేగిన మంటల వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా, గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.