
చైనాలోని క్వింగ్డావో షిప్యార్డ్లో రిపేర్ అవుతున్న కార్గో నౌకలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 20 మంది మరణించగా, ఐదుగురు గల్లంతయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 42 మంది ఉండగా, 12 మందిని సురక్షితంగా తరలించి, గాయపడిన ఐదుగురిని ఆసుపత్రిలో చేర్పించారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.15 గంటలకు జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు జరిపి బాధితులకు సాయం అందించాలని అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశించారు.