
అన్నవరం దేవస్థానం ఆవరణలో ఎమ్మార్పీ రూ.18 ఉన్న వాటర్ బాటిల్ను రూ.25కు విక్రయించిన వ్యాపారికి కాకినాడ వినియోగదారుల ఫోరం రూ.7 లక్షల జరిమానా విధించింది.
ఫిబ్రవరి 22న జరిగిన ఈ ఘటనపై భక్తుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయగా, అదనంగా వసూలు చేసిన రూ.7తో పాటు కోర్టు ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించారు.
వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7 లక్షలు చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు రఘుపతి వసంత్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.