
మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని వెయ్యి డప్పులతో ముట్టడించాలని కాంగ్రెస్ నేత సతీష్ మాదిగ పిలుపునిచ్చారు.
ఈ పిలుపుతో ఎర్రవల్లి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి, రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.
ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.