
ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన నాయకులలో ఒకరని, ఆయన నిర్ణయాలు వివేకవంతంగా ఉంటాయని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ కొనియాడారు.
శుక్రవారం న్యూఢిల్లీలో మోదీతో సమావేశమైన బార్ట్ డి వెవర్, శనివారం ముంబైలో భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.
ప్రపంచంలోని ఇతర నాయకుల బెదిరింపు ధోరణికి భిన్నంగా మోదీ మాటలు మార్గదర్శకత్వాన్ని అందిస్తాయని పేర్కొంటూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల వైఖరిని ఆయన విమర్శించారు.