
ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోని ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్పై ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో విజయం సాధించి దులీప్ ట్రోఫీ సెమీఫైనల్కు చేరుకుంది.
తొలుత బ్యాటింగ్లో సుదీప్ కుమార్ ఘరామీ (146), షాబాజ్ అహ్మద్ (167) సెంచరీలతో రాణించగా, బౌలింగ్లో అభిజిత్ సర్కార్ 5 వికెట్లు తీసి ప్రత్యర్థిని 111 పరుగులకే కట్టడి చేశారు.
రెండో ఇన్నింగ్స్లో అనుకూల్ రాయ్ 5 వికెట్లతో చెలరేగగా, వైభవ్ సూర్యవంశీ 4 బంతుల వ్యవధిలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.