
ముంబై-గోవా హైవే విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రారంభోత్సవానికి రానని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు సుమారు రూ. 16,000 కోట్లు ఖర్చు చేయగా, పనులు 93-94 శాతం పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు.
అక్టోబర్లో స్వయంగా రోడ్డు మార్గంలో ప్రయాణించి పనులను తనిఖీ చేస్తానని, బాధ్యులైన కాంట్రాక్టర్లను బ్లాక్లిస్ట్లో పెడతానని ఆయన హెచ్చరించారు.