
వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుండటంతో ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆగస్టు 7న వెల్లడించారు.
తీరప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని హెచ్చరించారు.