
చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన 'నేతన్న సేవలో' పథకం కింద అర్హులైన వారికి రూ. 25,000 ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
క్షేత్రస్థాయిలో సర్వే సక్రమంగా జరగకపోవడంతో మదనపల్లెలో 700 మంది, ధర్మవరంలో 500 మందికి పైగా షెడ్డు కార్మికులకు ఈ పథకం అందలేదని చేనేత సంఘాలు ఆరోపించాయి.
సొంత మగ్గం లేని కారణంగా మాస్టర్ వీవర్స్ వద్ద పనిచేసే కార్మికులను అధికారులు అనర్హులుగా గుర్తించడంతో, అర్హులైన వారికి కూడా సాయం అందడం లేదని కార్మికులు వాపోతున్నారు.