
95 ఏళ్ల సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి శ్వాసకోశ సమస్యలతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
గత వారం రోజులుగా ఆసుపత్రిలో ఉన్న ఆమె ఆరోగ్యం బుధవారం రాత్రి క్షీణించడంతో ఐసీయూకి తరలించగా, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
1950లో 'షావుకారు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జానకి, తన కెరీర్లో 400కు పైగా చిత్రాల్లో నటించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు.