
గృహోపకరణాల తయారీ సంస్థ ఆటమ్బర్గ్ టెక్నాలజీస్ రూ. 450 కోట్ల విలువైన ఐపీవో కోసం సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది.
ఈ ఐపీవో ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 150 కోట్లు మార్కెటింగ్కు, రూ. 100 కోట్లు పరిశోధనలకు, రూ. 90 కోట్లు రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1,294 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా, రూ. 149 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.