బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మేడ్చల్, మెదక్, సిద్దిపేట, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.